ఒంగోలు: నిస్సహాయులకు సాయమందించే సామాజిక సేవను మించిన ఆనందం మరొకటి లేదని ప్రజాకవి డా.మొగిలి దేవ ప్రసాద్ అన్నారు.సూర్యశ్రీ దివ్యాంగుల సేవా ట్రస్టు ఆధ్వర్యంలో ట్రస్టు కార్యాలయంలో పేద మహిళకు ధన సహాయం, నిత్యావసర వస్తువులు ఇచ్చి చేయూతనందించారు.డా.మొగిలి మాట్లాడుతూ.. ట్రస్టు వారు గత మూడేళ్ళుగా ఎందరో నిరు పేదలకు,అభాగ్యులకు అనేక సేవలందించడం అభినందనీయమన్నారు.
ఈ సందర్భంగా ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ..
ఇస్లాం పేటకు చెందిన షేక్ దిల్షాద్ కడుపులో నీరు చేరి వైధ్యఖర్చులకు డబ్బులు లేక భాధపడుతోందన్నారు.
ట్రస్టు కార్యదర్శి సర్ధార్ భాష మాట్లాడుతూ.. నిస్సహాయ స్ధితిలో ఉన్న ఈ పేదరాలి వైధ్య ఖర్చుల కోసం.. దాతల సహకారంతో రూ.5000/-, బియ్యం కట్టలు,నిత్యావసర వస్తువులు అందించామన్నారు.ఈ సేవలో దివ్యాంగ విద్యార్థులు, నున్నా ఆంజనేయులు,సుబ్బు తదితరులు పాల్గొన్నారు.
Leave a comment